ఎల్బీనగర్, జూన్ 10: లింగోజిగూడ డివిజన్లోని ఏ కాలనీలోనూ ముంపు సమస్య రానివ్వమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మార్నింగ్ వాక్లో భాగంగా లింగోజిగూడ డివిజన్లోని భాగ్యనగర్, తపోవన్ కాలనీల్లో మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్రావుతో కలిసి పర్యటించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక కాలనీ సమస్యలను పరిష్కరించేందుకు మరో కాలనీకి సమస్యలు సృష్టించబోమన్నారు. ట్రంక్లైన్ నిర్మాణంతో కాలనీలో సమస్యలు అధికమవుతాయనే అపోహలు అవసరం లేదని, ఇంజినీరింగ్ అధికారుల సూచనల మేరకే పనులు సాగుతున్నాయన్నారు.
భాగ్యనగర్కాలనీలో పనుల నేపథ్యం లో 25 ఇండ్లలోకి నడిచే పరిస్థితి లేనందున సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు వెంటనే ట్రెంచ్ కొట్టి నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, మాజీ కౌన్సిలర్ కందికంటి ప్రేంనాథ్గౌడ్, డివిజన్ అధ్యక్షుడు పగిడిమర్రి తిలక్రావు, నర్రె శ్రీనివాస్ కురుమ, శ్రీధర్గౌడ్, శ్రావణ్కుమార్, జగన్నాథ్రెడ్డి, మధుసాగర్, ఐలయ్య, రాము, రాజుయాదవ్, సాయికిరణ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతిఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహకారంతో ఎంతో మంది పేదల కుటుంబాలకు పెండ్లీల భారం తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో హయత్నగర్ ఎంఆర్ఓ ప్రమీలాదేవి, లబ్ధిదారులు పాల్గొన్నారు.