ఎల్బీనగర్, మే 18 : కరోనా బాధితులను ఉచితంగా దవాఖానకు తీసుకెళ్లేందుకు స్వచ్ఛంద సంస్థలు అంబులెన్స్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం పీస్ వెల్ఫేర్ సొసైటీ, నిర్మాణ్ పుణ్యభూమి ఫౌండేషన్ సభ్యులు నియోజకవర్గం పరిధిలో కొవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్ను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ కరోనా బారిన పడిన వారికి చేయూతను అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా సోకిన వారు ఉచిత అంబులెన్స్ సదుపాయాన్ని ఉపయోగించుకుని దవాఖానలో చేరి చికిత్స తీసుకోవాలన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన పీస్ వెల్ఫేర్, నిర్మాణ్ పుణ్యభూమి ఫౌండేషన్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఉచిత అంబులెన్స్ సౌకర్యం కావాల్సిన వారు 99853 45108 కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు చింతల రవికుమార్, శివప్రకాశ్, సంస్థ ప్రతినిధులు డాక్టర్ బొగ్గు సురేశ్, వేణుగోపాల్ రావు, శ్రీనివాస్, కిశోర్, వెంకట సుబ్బారావు, రామకృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.