హయత్నగర్, సెప్టెంబర్ 19 : కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పా టు చేసుకోవడం వల్ల దొంగతనాలను అరికట్టవచ్చని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఆదివారం హయత్నగర్ డివిజన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డితో కలిసి కాలనీవాసులు సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తెలిపారు. నిఘా నేత్రాలతో నేరాలను నియంత్రించవచ్చునని ఉద్ఘాటించారు. కాలనీలో అతి త్వరలో డ్రైనేజీ పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గుడాల మల్లేశ్, నాయకులు భాస్కర్ సాగర్, మల్లీశ్వరి, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రొయ్య భాస్కర్, శ్రీనివాస్, నెహ్రూ, స్వామి, సత్యనారాయణ, యాదగిరి, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.