శ్రీనగర్కాలనీ, ఆగస్టు 15 : ఖైరతాబాద్ నియోజకవర్గంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వేంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలోని పలు బస్తీలు, కాలనీల్లో త్రివర్ణ పతకాలను స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ ప్రతినిధులు, అధికారులు ఆవిష్కరించారు. ఆదివారం ఉదయం నందినగర్ మైదానంలో, ఇబ్రహీంనగర్ తదితర బస్తీల్లో జాతీయ పతాకాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆవిష్కరించారు.
పంజగుట్ట ప్రతాప్నగర్తో పాటు పలు బస్తీల్లో కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నేత మన్నె గోవర్దన్రెడ్డి, మాజీ కార్పొరేటర్ భారతీనాయక్, రాములునాయక్, బాబునాయక్ తదితరులు పాల్గొన్నారు.