ఖైరతాబాద్, జూన్ 17: రాష్ట్ర మంత్రిగా గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొగిడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు ఆ పథకాలనే విమర్శస్తున్నారని, ఇది పేద, బలహీన వర్గాలను కించపర్చడమేన ని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం ఖైరతాబాద్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం దానం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకా లు వ్యర్థమంటూ ఈటల వ్యాఖ్యలు చేయ డం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే వెంట గజ్జెల అజయ్, రమేశ్, మేఘన ఉన్నారు.