హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మతిభ్రమించిందని, అందుకే ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించా రు. సీఎం కేసీఆర్ గురించి ఇష్టారీతిగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బండి మాటలకు సభ్యసమాజం తలదించుకుంటున్నదన్నారు.
తనపార్టీలో తనకు తెలియకుండా జరుగుతు న్న పరిణామాలను తట్టుకోలేక.. ఆ ఫ్రస్ట్రేషన్ను ప్రజల మీద తీస్తే ఊరుకోబోమని స్పష్టంచేశారు. సంజయ్కి తెలియకుండానే బీజేపీలో చేరికలు జరుగుతున్నాయని, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కవయ్యాయని అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
బండి సంజ య్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజల నుంచి స్పందన లేదని అందుకే అసహనంతో ఊగిపోతున్నారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ గూండా రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన అందరిపై కేంద్రం ఈడీ దాడులను బూచిగా చూపుతున్నదని విమర్శించారు. కేం ద్రం ఏ బూచీ చూపినా భయపడేది లేదని స్వయంగా సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు.
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చించటానికి తాను వస్తానని, బండి సంజయ్కి దమ్ముంటే కేంద్రం తెలంగాణకు ఏం చేసిం దో చెప్పేందుకు రావాలని సవాల్ విసిరా రు. మునుగోడులో బహిరంగ సభ ఎప్పు డు పెట్టుకోవాలో తమ పార్టీ ఇష్టమని దానికా రాజగోపాల్రెడ్డికి ఏం సంబంధమని క్రాంతికిరణ్ మండిపడ్డారు. బీజేపీలో చేరి వేల కోట్లు సంపాదించేందుకే తప్ప మునుగోడు ప్రజలను ఉద్దరించేందుకు రాజగోపాల్రెడ్డి రాజీనామా చేయలేదని ఆరోపించారు. బీజేపీ ఎన్ని వేషాలు వేసినా మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తంచేశారు.