మేడ్చల్, ఫిబ్రవరి 15 : మహిళా సమానత్వంలో సమాజ పురోగతి సాధ్యపడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం మహిళా సమానత్వాన్ని కాంక్షిస్తూ 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాధవీలత, హెచ్వోడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.