రామంతాపూర్, మార్చి 10: ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి తెలిపారు. శుక్రవారం దేవేందర్నగర్ కాలనీకి చెందిన హబ్సిగూడ బీఆర్ఎస్ నాయకురాలు జీనత్బేగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చా రు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరిస్తామని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మారెడ్డి, రేణుక, సంతోశ్, మల్లేశ్వరి, స్వరూప, అంజలి తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా ‘ఉప్పల్ భగాయత్ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్’ కన్వీనర్ మేకల మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి భగాయత్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు తదితర సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి సమస్యను పరిష్కరించాలన్నా రు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారు గోనె అర్జున్రెడ్డి, శ్రీనివాసరావు, వినోద్, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హబ్సిగూడ డివిజన్ కాకతీయ నగర్లోని మహాంకాళీ, రామమందిరం తిరు కల్యాణోత్సవానికి, బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ కమిటి సభ్యులు ఎమ్మె ల్యే బేతి సుభాష్రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ గాయం శ్రీధర్రెడ్డి, అర్చకులు గట్టు శ్రీనివాసాచార్యులు, మల్లికార్జున శాస్త్రి, శ్రీనివాస్చారి, నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం రవికుమార్, అరటికాయల భాస్కర్, ప్రదీప్రెడ్డి, లక్ష్మినారాయణ,పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ. 42,500 ఎల్వోసి పత్రాన్ని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి శుక్రవారం లబ్ధి దారురాలు సుజాత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.