చర్లపల్లి, సెప్టెంబర్ 28 : నియోజకవర్గ పరిధిలో వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా నాలాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్, శివసాయినగర్ ఫేజ్-3లోని నాలాపై బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పద్మారెడ్డి ఎమ్యెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శివసాయినగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరతగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కాలనీలో డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి స్థాయిలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.
నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి.. పనులు చేపట్టనున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్, చక్రీపురం కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మంగళవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కలిసి.. కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేం దుకు, మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు నిధులు కేటాయించనున్నామని తెలిపారు. డివిజన్లో డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ నిర్మాణం చేపట్టిన వెంటనే రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కాలనీలో పారిశుధ్య పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాఘవరెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, వెంకటేశ్వర్రావు, ఆంజనేయులు, బాల్రాజుగౌడ్, వెంకటేశ్గౌడ్, కృష్ణరాజు, నాగరాజు, హరి తదితరులు పాల్గొన్నారు.