ఉప్పల్, మార్చి 31: ఉప్పల్ ప్రజల గుండెల్లో అన్న బండారి రాజిరెడ్డి చిరస్థాయిగా నిలుస్తారని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఉప్పల్ -నారపల్లి ఎలివేటెడ్ కారిడార్కు శ్రీబండారి రాజిరెడ్డి కారిడార్గా నామకరణం చేస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.104 జారీ చేయడం పై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
మీడియా సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సేవలను స్మరించుకుంటూ నామకరణం చేయడం అభినందనీయమన్నారు.