శేరిలింగంపల్లి, నవంబర్ 8 : ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ రూ. 2.53 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో పనులు చేపడుతున్నదన్నారు.
ఇందులో భాగంగానే నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి రూ. 2.53 కోట్లతో మైహోం మంగళ, నెహ్రూనగర్, బాపునగర్, గోపినగర్ కాలనీల్లో వరద నీటి కాలువ, అండర్గ్రౌండ్ డ్రైనేజీల పునరుద్ధరణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉంచేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ఇన్స్పెక్టర్ యాదగిరి, మాజీ కౌన్సిలర్ వీరేశంగౌడ్, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, నాయకులు రాజు యాదవ్, రవీందర్గౌడ్, రాంబాబు, కృష్ణ, నాగేశ్గౌడ్, ప్రసాద్, గోపాల్, రమణి, కాలనీ వాసులు పాల్గొన్నారు.
గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ రూ. 2 కోట్ల నిధులతో సోమవారం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ గంగాధర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబాలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి పనుల్లో భాగంగా గోపన్పల్లి, ఎన్టీఆర్నగర్, తాజ్నగర్, ప్రశాంత్హిల్స్ కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేందుకు రూ. 2 కోట్లతో నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు నాయక్, రాజు యాదవ్, చెన్నంరాజు, నరేశ్, సత్యనారాయణ, సురేందర్, సతీశ్, జగదీశ్, వినోద్, మల్లేశ్, రమేశ్, రాజు ముదిరాజ్, యాదగిరి, రామేశ్వరమ్మ, అంజమ్మ, అరుణ, విజయ, కాలనీ వాసులు పాల్గొన్నారు.
కొండాపూర్, నవంబర్ 8 : కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కోట్ల రూపాయలతో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను కొనసాగిస్తుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం ఆయన నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్లో రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి పలు కాలనీల్లో డివిజన్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ.. అండర్గ్రౌండ్ డ్రైనేజీలతో సమస్యలు ఉండకుండా శాశ్వత పరిష్కారం దిశగా పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతతో సకాలంలో పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీకాంత్, జీహెచ్ఎంసీ అధికారులు ఏఈ జగదీశ్, వర్క్ఇన్స్పెక్టర్ కృష్ణ, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, కృష్ణ గౌడ్, రాజు యాదవ్, రమేశ్, బలరాం, జంగంగౌడ్, రూపారెడ్డి, కృష్ణవేణి, తిరుపతి, నరేశ్, రవి పాల్గొన్నారు.