హైదరాబాద్ : హైదరాబాద్లో నగరంలో శాంతి భద్రతలు రోజురోజు క్షిణించిపోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిఘా కొరవడడంతో పోకిరీలు రెచ్చిపోతున్నారు. నగర శివారులోని ఘట్కేసర్ నుండి బోడుప్పల్ హైవే మీద అర్ధరాత్రి వేళ పెళ్లికి వెళ్లి కారులో వస్తున్న కుటుంబాన్ని కొంతమంది బైక్లపై వెంబడిస్తూ, భయబ్రాంతులకు గురిచేయడం కలకలం రేపింది.
కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని గమనించిన ఆకతాయిలు మరింత రెచ్చిపోయారు. బైక్లను కారుకు అడ్డంగా తిప్పుతూ, కేకలు వేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. నడిరోడ్డుపై ఇంతలా రెచ్చిపోతున్నా పట్టించుకునేవారు లేరా.. లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది అంటూ ఆగ్రహం నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యంపై దుమ్మొత్తిపోస్తున్నారు.
నడి రోడ్డుపై కారును వెంబడిస్తూ పోకిరీల హల్చల్
హైదరాబాద్ నగర శివారులోని ఘట్కేసర్ నుండి బోడుప్పల్ హైవే మీద అర్ధరాత్రి వేళ పెళ్లికి వెళ్లి కారులో వస్తున్న కుటుంబాన్ని బైక్లపై వెంబడిస్తూ, భయబ్రాంతులకు గురిచేసిన పోకిరీలు
కారు డ్యాష్ క్యామ్లో రికార్డైన దృశ్యాలు
కారులో మహిళలు,… pic.twitter.com/vmuyB3yIN5
— Telugu Scribe (@TeluguScribe) June 29, 2026