మీర్పేట (హైదరాబాద్) : లంచం కేసులో మరో ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట పోలీస్స్టేషన్ (Meerpet SI) లో ఎస్సైగా పనిచేస్తున్న బొడ్డుపల్లి సైదులు లంచం(Bribe) తీసుకుంటూ పట్టుబడ్డాడు. శనివారం ఏసీబీ (ACB) అధికారులకు అందిన సమాచారం మేరకు పోలీసుస్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలాపూర్ మండలం గుర్రంగూడ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారి మదాని సుభాష్ నుంచి ఎస్సై సైదులు రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
నజముద్దీన్ అనే వ్యక్తి పెట్టిన కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు గాను ఎస్సై లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఎస్సైపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.