బన్సీలాల్పేట్, నవంబర్ 23: శాంతి భద్రతల నిర్వహణలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థా నంలో ఉందని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జమాతుల్ ఖురేషి, సికింద్రాబాద్ (మేకలు, గొర్రె ల విక్రయదారుల సామాజిక సేవా సంఘం) ఆధ్వర్యంలో బోయిగూడలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో హిందూ, ముస్లీం, క్రిస్టియన్, సిక్కు మతాలను, నార్త్ ఇండియన్స్ను సమానంగా గౌ రవిస్తున్న ఏకైక సెక్యులర్ సీఎం కేసీఆర్ అని, హైదరాబాద్ మహా నగరంలో గంగా జమునా తెహజీబ్ సంస్కృతి విరాజిల్లుతున్నదని ఆయన అన్నారు. కరెంట్ కోతలు లేకుండా పరిశ్రమలు అద్భుతంగా నడుస్తున్నాయని, పేద ప్రజల కు 20 వే ల లీటర్ల తాగునీరు ఉచితంగా అందిస్తున్నామని తెలిపా రు.
ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడగానే సం క్షేమం, అభివృద్ది పనులు మరింత వేగంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఆడబిడ్డ వివాహానికి శాదీ ముబారక్ పథకం ద్వారా ఇప్పటి వర కు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారని, ఎన్నికల అనంతరం దానిని రెండు లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. తెలంగాణాలో మై నార్టీ విద్యార్థుల కోసం అత్యధిక రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీలను నిర్వహిస్తున్నామని తెలిపా రు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణకు ఏమి చేయలేదన్నారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.