అబిడ్స్ : దేవీ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గా, శ్రీ నాగలక్ష్మి అమ్మ వార్ల ఆలయం లో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతి నిధులు మంత్రికి స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు.
ఒక వైపు బతుకమ్మ, మరోవైపు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో నగరం కోలాహలంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశాలతో అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంతోషమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జి శంకర్ యాదవ్, డాక్టర్ సురేఖ, మాజీ కార్పొరేటర్ రాంచంద్రరాజు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ గుప్తా, ఆలయ కమిటీ చైర్మన్ రామరాజు, సభ్యులు బి శ్రీశైలం, వి అనిల్ కుమార్, బి రవీందర్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.