హైదరాబాద్ : ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సందర్శించారు. ఈ సందర్శనలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ ఉమర్ జలీల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న సుమారు 44 ఎకరాల విస్తీర్ణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో సమగ్ర ప్రణాళిక తయారీ కోసం హాస్పిటల్ లో మంత్రి, అధికారులు పర్యటించి, పరిశీలించారు.