విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున కొత్త ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శుక్రవారం నుమాయిష్లో ఏర్పాటు చేసిన విజయ డెయిరీ ఉత్పత్తుల స్టాల్ను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదర్ సిన్హాతో కలిసి ప్రారంభించారు.
అబిడ్స్, జనవరి 6: విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున నూతన ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన విజయ డెయిరీ ఉత్పత్తుల స్టాల్ను డెయిరీ చైర్మన్ సోమా భరత్కుమార్, పశు సంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదర్ సిన్హాలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి ఎగ్జిబిషన్కు వచ్చే ప్రజలకు విజయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో స్టాల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం బూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈఓ మంజువాణి, ఎగ్జిబిషన్ అసోసియేషన్ వైస్ చైర్మన్ అశ్విన్ మార్గం, విజయ డెయిరీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ మల్లికార్జున్, అధికారులు అరుణ్, మల్లికార్జున్, ప్రభాకర్, కామేశ్, బీఆర్ఎస్ నాయకులు సీహెచ్ ఆనంద్కుమార్ గౌడ్, ఎం.ఆనంద్కుమార్గౌడ్, ప్రదీప్ అగర్వాల్, నందుకుమార్, తదితరులు పాల్గొన్నారు.