బన్సీలాల్పేట్/ మారేడ్పల్లి, నవంబర్ 16: సనత్నగర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని, మెజార్టీ సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మోం డా డివిజన్ బండిమెంట్, జై న్భవన్, సజ్జన్లాల్ స్ట్రీట్, టకార బస్తీ, పాట్ మార్కెట్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. అదేవిధంగా బండిమెట్, ఆదయ్యనగర్ లలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ప్రతి ఇంటా పూలమాలలు వేసి స్వాగ తం పలికారు. మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజల సం క్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. సనత్నగర్ నియోజకవర్గంలో కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని..అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే తన మెజార్టీకి దోహదం చేస్తాతాయని చెప్పారు.
తాను పుట్టిన పెరిగిన ఈ ప్రాంతంలో ప్రజలందరూ స్వచ్చంధంగా ముం దుకు వచ్చి మద్దతు పలుకుతున్నారని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మీ వెంట మే ము ఉన్నా ము అన్నా… అంటూ ముందుకు వస్తున్నారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఏ నాడు ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల ముందకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని.. ప్రజలందరూ గమనిస్తున్నారని రాను న్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. సనత్నగర్లో ఎవరూ ఊహించని స్థాయిలో 1400 వందల కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, బీఆర్ఎస్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, రాములు, జయరాజ్, సత్యనారాయణ, మహేష్, అమర్, ఆకుల హరి కృష్ణ పాల్గొన్నారు.
తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధితో భోలక్పూర్ బస్తీల రూపురేఖలు మారిపోయాయని, మరిం త సేవ చేయడానికి ఈ నెల 30న తప్పకుండా ఓటువేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సాయంత్రం బన్సీలాల్పేట్ డివిజన్లోని భోలక్పూర్, సుందరయ్యనగర్, ఆంజనేయస్వామి కాల నీ, ఎంఐజీ కాలనీ ప్రాంతాలలో ఇంటింటి పాదయాత్ర నిర్వహించారు. ప్రతి బస్తీలో ఆయనకు అఖండ స్వాగతం లభించింది. అడుగడుగునా ఆయనకు మహిళలు మంగళహారతులను ఇచ్చి, విజయతిలకం దిద్దారు.
భోలక్పూర్లోని ప్రతి బస్తీలో తాను రోడ్లు, పార్కులు, వీధీ దీపాలు, కమ్యూనిటి హాళ్లు, ఆంజనేయస్వామి దేవాలయం, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేశానని, తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించానని అన్నారు. ఎలాంటి కష్టం వచ్చినా తాను పేదలకు అండగా ఉంటానని, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని మంత్రి తలసాని అన్నారు. బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే హేమలత, మాజీ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి, బీఆర్ఎస్ డివిజన్ ఇన్చార్జి జీ.పవన్కుమా ర్గౌడ్, అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, కార్యదర్శి ఎం.మ హేందర్, నాయకులు ఏసూరి మహేశ్, శ్రీ కాంత్రెడ్డి, టి.శ్రీను, బాబు, నాగరాజు, నర్సింహ, సురేశ్, వెంకట్, శాహెద్, రమణ, శ్రీనివాస్, మల్లేశ్, రవీందర్, ఎల్లేశ్వర్, లావణ్య, నాగలక్ష్మి, అమృత పాల్గొన్నారు.