హైదరాబాద్: నగరంలో మరో ఫుట్ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. పాదచారుల భద్రత కోసం ఎర్రగడ్డలో నూతనంగా నిర్మించిన ఫుట్ఓవర్ బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ అలీ, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. సుమారు రూ.5 కోట్ల వ్యయంతో స్టేర్ కాస్, లిఫ్ట్ గా, ఎస్కలేటర్, షెల్టర్ వాక్ వేతో పాటు మెరుగైన లైటింగ్, భద్రత సౌకర్యాలతో దీనిని నిర్మించారు.
హైదరాబాద్ వ్యాప్తంగా 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు రూ.75.65 కోట్ల అంచనా వ్యయంతో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. అందులో ఇప్పటి వరకు 7 ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు అందుబాటులోకి వచ్చాయి. మిగిలినవాటి నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.