సనత్నగర్ జోన్ బృందం అక్టోబర్ 6:రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జన్మదిన వేడుకలు మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మంత్రి పుట్టిన రోజు సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, విజయడెయిరీ చైర్మన్ సోమా భరత్కుమార్, పశుసంవర్థక శాఖ డైరక్టర్ రాంచందర్, మత్య్సశాఖ కమిషనర్ లచ్చిరాంబూక్యా, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రవీందర్యాదవ్, జలమండలి అధికారులు ప్రభు, కృష్ణ, శశాంక్తో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొని కేక్ కట్చేశారు.
నిత్యం పేదల నడుమ ఉండే ప్రజానాయకుడైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను సనత్నగర్ నియోజకవర్గం ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తారని బీఆర్ఎస్ పద్మారావునగర్ ఇన్చార్జి పవన్కుమార్ గౌడ్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.