బన్సీలాల్పేట్ డిసెంబర్ 7 : హమాలీ బస్తీవాసుల సమస్యలను రైల్వే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం పద్మారావునగర్లోని హమాలీ బస్తీ వాసులు మారేడ్పల్లిలోని నివాసంలో మంత్రిని కలిశారు. 70 ఏండ్ల నుంచి తాము ఇక్కడే నివసిస్తున్నామని, బస్తీ నుంచి రాకపోకలు సాగించే ఏకైక రహదారిని రైల్వే శాఖ అధికారులు మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి వెంటనే నార్త్జోన్ డీసీపీ కల్మేశ్వర్తో ఫోన్లో మాట్లాడారు. రహదారులను మూసివేయకుండా రైల్వే అధికారులతో చర్చించాలని కోరారు.
అమీర్పేట్, డిసెంబర్ 7: చదువుతో పాటు క్రీడలకు తగిన ప్రాముఖ్యతనిస్తూ యువతరం ముందుకు సాగాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం అమీర్పేట్ జీహెచ్ఎంసీ మైదానంలో టీఆర్ఎస్ నాయకులు సచిన్, ముఖేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలసాని క్రికెట్ టోర్నమెంట్ను అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్, నాయకులు హనుమంతరావు, గులాబ్సింగ్ రాజ్పురోహిత్, అశోక్యాదవ్, సింగారపు శ్రీనివాస్ గుప్త, బీఆర్నాయారణ రాజు, నిమ్మ నరేందర్రెడ్డి పాల్గొన్నారు.