బేగంపేట, జూలై 8: ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలకు విచ్చేయాలంటూ ఆలయ ఈవో గుత్తా మనోహర్రెడ్డి, చైర్మన్,పాలకమండలి సభ్యులు గురువారం మారేడుపల్లిలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను ఆహ్వానించారు. అనంతరం జాతరకు సంబంధించిన వాల్పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. కార్పొరేటర్ సుచిత్రను ఉత్సవాలకు ఆహ్వానం పలికారు.