హైదరాబాద్ : సోదర భావానికి ప్రతీక రక్షాబంధన్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister talasani )అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా గురువారం వెస్ట్ మారెడ్పల్లిలోని తన నివాసానికి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి మంత్రి చేతికి రాఖీలు కట్టారు. అమీర్పేట మాజీ కార్పొరేటర్తో పాటు బన్సీలాల్పేట, అమీర్పేట, సనత్ నగర్, బేగంపేట, మొండా మార్కెట్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన హిందూ, ముస్లిం మహిళలు కూడా మంత్రికి రాఖీలు కట్టి స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో కూడా మంత్రికి రాఖీలు కట్టారు.