హైదరాబాద్ : దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎన్నికల నోటిఫికేషన్కు ముందే అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దమ్ముంటే వారం రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )సవాల్ విసిరారు. బుధవారం కాచిగూడలోని తుల్జా భవాని ట్రస్టు సందర్శించి మాట్లాడారు.
ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ధైర్యం మాకుంది. మీరేం చేశారో చెప్పగలరా? అని ప్రతి పక్షాలను సూటిగా ప్రశ్నించారు.బీజేపీకి అభ్యర్థులు లేరు. కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటలకే పరిమితమైంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజలు తిరిగి BRS పార్టీకి పట్టం కడతారన్నారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు తావు లేదని మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.