హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని మంత్రి పేర్కొన్నారు. బొజ్జల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, బొజ్జల గుండెపోటుతో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు.