హైదరాబాద్ : తెలంగాణ ఫుడ్స్ నూతన చైర్మన్ రాజీవ్ సాగర్కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ సాగర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని శాలువాతో సన్మానించారు. రాజీవ సాగర్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మంత్రి ఆకాంక్షించారు.