హైదరాబాద్ : శ్రీరామ నవమి సందర్భంగా సనత్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన
సీతారాముల కల్యాణోత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సనత్ నగర్లోని హనుమాన్ దేవాలయం, పూల్ బాగ్ హనుమాన్ టెంపుల్, బేగంపేటలోని కేసరి హనుమాన్ దేవాలయాల్లో జరిగిన స్వామి వారికి కల్యాణ వేడుకలు మంత్రి తలసాని హాజరయ్యారు. ఆయా ఆలయాల్లో మంత్రి పూజలు చేశారు. అంతకు ముందు అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.