రవీంద్రభారతి, జూలై 14 : తెలంగాణ టూరిజాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు బీఆర్ఎస్ ప్రభు త్వం కృషిచేస్తున్నామని ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. దేశ, విదేశీ టూరిస్టులకు మైరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, షిరిడీకి రెండు ఏసీ స్లీపర్ బస్సులు, హైదరాబాద్ సిటీ నైట్ సీన్ కోసం ఏసీ మినీ బస్ సర్వీసులను శుక్రవారం రవీంద్రభారతిలోని ప్రాంగణంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్, గీత కార్మిక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్తో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడు తూ.. గతంలో ఈ రూట్లలో స్లీపర్ బస్సులు ఉన్నప్పటికీ , ప్రయాణికుల డిమాండ్ మెరకు మరో రెండు బస్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాంతాలు కూడా టూ రిజం హబ్గా మారుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చం ద్రశేఖర్రావు తొమ్మిదేండ్లలో టూరిజాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో టూ రిజం ఎండీ మనోహర్,మధురారెడ్డి పాల్గొన్నారు.