తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నేరేడ్మెట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని శనివారం ఆయన ఎమ్మెల్యే వివేకానంద, శాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్తో కలిసి ఆవిష్కరించారు.
నేరేడ్మెట్, మే 13 : తెలంగాణ వీరత్వానికి, పరక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం నేరేడ్మెట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే వివేక్, శాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్, స్థానిక కార్పొరేటర్ మీనాతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచి, ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా అన్ని వర్గాలను ఏకం చేసి పాపన్న పోరాడిన తీరు గొప్పదని అన్నారు. కొన్నేండ్ల క్రితమే వెనుకబడిన వర్గాల పక్షాన పోరాడిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. మొఘల్ చక్రవర్తుల అరాచక పాలనను ఎదురించి నిలిచిన ధీరుడు అని ప్రశంసించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గౌడల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి తెలిపారు. అనంతరం సర్దార్ పాపన్న గౌడ్ కమిటీ సభ్యులు జూలకంటి సాయి కృష్ణ గౌడ్, అల్లాడి సాయి చందర్ గౌడ్, రాజేశ్ గౌడ్, జైరాం గౌడ్, శ్రీధర్ గౌడ్, రాజు గౌడ్, అభిషేక్ గౌడ్, సాయి కిరణ్ గౌడ్, శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ నేరేడ్మెట్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టుకోవడానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాపన్న గౌడ సేన కమిటీ సభ్యులు, ఈస్ట్ ఆనంద్బాగ్ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్, నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, ఉపేందర్ రెడ్డి, ఎస్ఆర్ ప్రసాద్, జీఎన్వి సతీశ్ కుమార్, రామూయాదవ్, చెన్నారెడ్డి, శివ, రాజు, బాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.