కందుకూరు, డిసెంబర్ 6 : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని నిశితా ఇంజినీరింగ్ కళాశాలలో ఇంద్రారెడ్డి మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఎంపిక కోసం ఉచితంగా నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రాన్ని మంత్రి పరిశీలించి అభ్యర్థులతో కాసేపు ముచ్చరించారు. శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు గుడ్లు, పాలు అందజేసి.. ఆల్ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిరుద్యోగుల కోసం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. యువతీ యువకులు పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్గా మారుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతీ పాండు, వైస్ ఎంపీపీ గంగుల శమంతా ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, అందుగుల సత్యనారాయణ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, కాకి దశరథ, ఎలుక మేఘనాథ్రెడ్డి, కొండల్రెడ్డి, యూత్ నాయకులు దామోదర్గౌడ్, తాళ్ల కార్తిక్, పాండుగౌడ్, బొక్క దీక్షిత్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని బేగరికంచెలో రూ.50లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. మండల కేంద్రంలో మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. మీర్ఖాన్పేట్ గ్రామంలో అమెజాన్ వెబ్సర్వీసెస్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో కోటి రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. సౌత్ ఏసియా కమర్షియల్ బిజినెస్ ప్రెసిడెంట్ పూనిత్ చందోక్, డేటా సెంటర్ ప్లానింగ్ డెలివరి ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ వోండర్హార్, సోజి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, జిల్లా విద్యాధికారి సుశీంధర్ రావు, సర్పంచ్ బ్రాహ్మణపల్లి జ్యోతీ చంద్రశేఖర్, ఎంపీటీసీ కాకి రాములు, చిర్ర సాయిలు, అధికారులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.