పహాడీషరీఫ్, జనవరి 27 : ఎక్కడైనా ఏ ఆపద వచ్చినా.. మా వెనుక పోలీసులు, షీటీమ్స్ ఉన్నారన్న ధైర్యాన్ని మహిళలకు ప్రభుత్వం కల్పించిందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న 33 మందికి ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుట్టుమిషన్లతో వచ్చిన ఆదాయంలో ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. షీటీమ్స్ ఏర్పాటుతో ఈవ్టీజింగ్, పోకిరీల వేధింపులు తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అన్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్సింగ్, ఏసీపీ పురుషోత్తంరెడ్డి, షీ టీమ్స్ డీసీపీ షేక్ సలీమా, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ గంగాదీప్ కోహిలి తదితరులు పాల్గొన్నారు.
పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో శుక్రవారం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
మంత్రి సబితాఇంద్రారెడ్డి శిక్షణ పూర్తి చేసుకున్న 33 మంది మహిళలకు కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. సీపీ డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు.