బడంగ్పేట, జూలై 24 : ఆకు పచ్చని తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి.. మంత్రి కేటీఆర్కు కానుక ఇద్దామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మంత్రి.. మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డీఈఓ సుసీంద్ర రావు, ఎంఈవో కృష్ణయ్య, కార్పొరేటర్లు, అధికారులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం వెంకటాద్రి నివాసంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఆ తర్వాత తుక్కుగూడలో ఈత, ఖర్జ్జూర, తాటి మొక్కలను రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీవెంకట్రెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు, కౌన్సిలర్లు, నాయకులతో కలిసి నాటారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు లక్ష డిక్షనరీలను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సూర్ణ గంటి అర్జున్, పెద్ద బావి శోభ ఆనంద్రెడ్డి, రాళ్ల గూడెం సంతోషి శ్రీనివాస్రెడ్డి, సుదర్శన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రామిడి రాంరెడ్డి, జంగారెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, పుట్టగల్ల సంతోశ్, వెంకటాచారి , జర్నిలిస్టులు, నాయకులు, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.