కందుకూరు, సెప్టెంబర్ 21 : పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెతలా తయారైంది జాతీయ రహదారి పరిస్థితి. నిర్లక్ష్యానికి కేంద్ర బిందువుగా మారింది నేషనల్ హైవే. ఈ రహదారిపై పయనించాలంటే ప్రజలు భయపడుతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేగా గుర్తించి రహదారిని వెడల్పు చేసి చేతులు దులుపుకున్నది. మిగులు పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నది. రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆర్అండ్బీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కందుకూరు మండల కేంద్రంలో జాతీయ రహదారిపై నీరు నిలిచి ఎన్ని రోజులైనా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు వెంబడి వెళ్లడానికి వాహనదారులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు.