బడంగ్పేట, సెప్టెంబర్ 25 : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ పెద్ద చెరువు ఆహ్లాదానికి కేరాఫ్గా మారింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో శరవేగంగా సుందరీకరణ పనులు చేపట్టడంతో మంత్రి సబితారెడ్డి ఆదివారం లేక్ఫ్రంట్ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరువు చిత్రాలను పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ట్వీట్ చేశారు.
మహేశ్వరం నియోజకవర్గంలో రూ.42 కోట్లతో 11 చెరువులను సుందరీకరణ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులను ఆమె ఆదివారం రాత్రి ప్రారంభించారు. బాలాపూర్ పెద్ద చెరువు సుందరీకణ పనులు మంత్రి ప్రారంభించడంతో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ట్విటర్ వేదికగా పోస్టు చేశారు. బాలాపూర్ పెద్ద చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, ఫర్నిచర్, టైయిల్స్, బండ్ తదితర వాటిని హెచ్ఎండీఏ నిధులతో అభివృద్ధి చేశామని ట్విటర్లో పోస్టు చేశారు. ప్రస్తుతం 70 చెరువులను సుందరీకరణ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.