బడంగ్పేట : టీఆర్ఎస్ నాయకుడు, టీఆర్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ స్వర్గీయ తీగల కృపాకర్ రెడ్డి మొదటి వర్థంతి కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హజరయ్యారు.
ఈ సందర్భంగా కృపాకర్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను నాయకులు గుర్తు వేసుకున్నారు. కరోనా కారణంగా ఆయన మృతి చెందడం పట్ల వారు అవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, తీగల నితీష్ రెడ్డి, తీగల దినేష్ రెడ్డి కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.