కీసర, ఆగస్టు 1: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధిలోని గోధుమకుంట గ్రామంలో మంత్రి మల్లారెడ్డి పలు కాలనీల్లో పర్యటించి స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్న తన సొంత నిధులను కేటాయించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణాలను చేయిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలాభివృద్ధి కోసం ఎన్ని నిధులైన కేటాయించి అభివృద్ధి చేయాలన్నదే తన ప్రత్యేక లక్ష్యమన్నారు.తాను కేటాయించిన నిధులతో పనులను త్వరగా పూర్తి చేయాలని అదేశించారు.
అనంతరం గోధుమకుంట గ్రామంలో పుట్ట నిఖితకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 1,00,116లక్షలు మంజూరు కాగా ఆ చెక్కును ఆమెకు అందజేశారు. చీర్యాల్ గ్రామంలోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయం, బీరప్ప ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని కలిసి ఆలయ నిర్మాణానికి నిధులు కావాలని కోరారు. స్పందించిన మల్లారెడ్డి మొత్తం రూ.10లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. మొదటి విడుతగా రూ.4లక్షలను సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్రెడ్డి, గోధుమకుంట సర్పంచ్ మహేందర్రెడ్డి, ఉప సర్పంచ్ ఆంజనేయులు, బీఆర్ఎస్ నేతలు పర్వత్రెడ్డి, సురేశ్, విజయ్కుమార్, పి. శ్రీనివాస్, సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.