హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం అమ్మవారికి తొలి బోనం సమర్పించింది.
మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయిని మహంకాళి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.