మేడ్చల్ రూరల్, జనవరి 24: కేంద్రంలో పాలిస్తున్న బీజేపీది అసమర్థ పాలన అని, ఆ పాలనతో దేశ ప్రజలు విసిగిపోయారని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం రూ. 50 లక్షల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ అంటేనే ఓ చరిత్ర అని, సీఎం కేసీఆర్ అంటే ఓ ఐకాన్ అని అన్నారు. రాష్ట్రంలోని 12,700 గ్రామాల్లో హరితహారం, వైకుంఠధామం, తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కు తుందని అన్నారు.
ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. దేశంలోని 19 రాష్ర్టాల్లో బీజేపీ సీఎంలు ఉన్నా ఎక్కడా కూడా మన రాష్ట్రంలో ఉన్న పథకాలు, అభివృద్ధి లేదని దుయ్యబడ్డారు.దేశంలోని ప్రజలు సీఎం కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారని, అన్ని రాష్ర్టాల్లో కూడా తెలంగాణ మాదిరి అభివృద్ధి చేస్తారనే ఆశతో ఉన్నారని తెలిపారు. 2024లో బీజేపీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్ పార్టీకే ఉందని అన్నారు.కార్యక్రమంలో మేడ్చల్ ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజయనందరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్, ఉప సర్పంచ్ నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, సింగిల్విండో చైర్మన్ రణదీప్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు బాబుయాదవ్, మాంగ్యానాయక్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి దర్శన్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, రాజమల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు డబుల్ ఇండ్లు కేటాయించేలా చర్యలు
వర్కింగ్ జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించేలా కృషి చేస్తామని కార్మిక ఉపాధిశాఖ మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చెంగిచర్ల జీజీ గార్డెన్లో జరిగిన మేడిపల్లి ప్రింట్మీడియా 2023 డైరీ ఆవిష్కరణలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమాజంలో మీడియా క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నదని కొనియాడారు. వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోఅభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నదని అన్నారు. నగర శివారు పీర్జాదిగూడలోని సీలింగ్ల్యాండ్ సమస్యను పరిష్కరించానని, బోడుప్పల్లోని దళితుల ల్యాండ్ ఫూలింగ్ సమస్య త్వరలో కొలిక్కివస్తుందన్నారు. ప్రెస్క్లబ్ శ్వాశ్వత భవన నిర్మాణంపై స్థానిక నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్రెడ్డి, మేయర్ బుచ్చిరెడ్డి, పీర్జాదిగూడ మేయర్ వెంకట్రెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీరవిగౌడ్, పార్టీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, కార్పొరేటర్లు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జంగయ్యయాదవ్,ప్రెస్క్లబ్ అధ్యక్షుడ మురళి, ప్రెస్క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పైప్లైన్ పనులు ప్రారంభించాలి
నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు మంగళవారం మంత్రిని కలిసి ముంపు కాలనీల్లో అండ్గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులను ప్రారంభించాలని వినతిపత్రాన్ని అందజేశారు. మిగులు పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హరి బాబు, శ్రీనివాస్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, సురేశ్, పలు కాలనీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.