మేడ్చల్, సెప్టెంబర్ 14: ప్రజా సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ అత్వెల్లికి చెందిన గోగికర్ చందుకు బీసీ బంధు రూ.లక్ష చెక్కును మంత్రి మల్లారెడ్డి గురువారం బోయిపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, దళితబంధు, గృహలక్ష్మి, గొర్రెలు, చేపల పంపిణీ తదితర పథకాల ద్వారా ప్రజలను ఆదుకుంటున్నారన్నారు. తాజాగా బీసీ బంధు పథకం కింద రూ.లక్ష అందజేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచి, హ్యాట్రిక్ సాధిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ నర్సింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, నాయకులు మండలి ఈశ్వరయ్య, మండలి రవికుమార్, సత్యనారాయణ, నారెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామానికి చెందిన పెంటేశ్, మలిగే నరేశ్, నవీన్చారీలకు బీసీ బంధు చెక్కులను మంత్రి మల్లారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచ్లఫోరం అధ్యక్షుడు విజయానందారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్రాజు, సుదర్శన్, పీఏసీఎస్ చైర్మన్ రణదీప్ రెడ్డి, రాజమల్లారెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, భాగ్యారెడ్డి, గోమారం శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.