శామీర్పేట, డిసెంబర్ 15 : రాష్ట్రంలో ఉన్న క్రైస్తవుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని అలియాబాద్లో క్రైస్తవులకు గురువారం క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… దేశ చరిత్రలో కనివినీ ఎరుగని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టి ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచ్ కుమార్, ఎంపీటీసీ సాయిబాబు, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, డైరెక్టర్ భూమిరెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జహీర్, తూంకుంట బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సతీశ్రెడ్డి, యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్గౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
జాతికి ఆదర్శం పటేల్
మేడ్చల్, డిసెంబర్ 15 : భారత జాతికి ఆదర్శం సర్దార్ వల్లబాయ్ పటేల్ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డులోని కిష్టాపూర్ అర్చన కాలనీలో ఏర్పాటు చేసిన వల్లబాయ్ పటేల్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎంతో దీక్ష దక్షత గల నేత పటేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్ గణేశ్, బీఆర్ఎస్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి, అర్చన సేవా సమితి అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, సుధాకర్ చారి, బుచ్చి రాములు, మోహన్ గౌడ్, కమలాకర్ రెడ్డి, వర్ధన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి, అశోక్, గిరిబాబు, రమణారెడ్డి, సత్యనారాయణ,మన్మదరావు, రామచంద్రారెడ్డి, భాస్కర్, లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.