సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): తమ కష్టాలను పరిష్కరించగల ధీశాలి కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ వాసుల నమ్మకం. ఆ నమ్మకానికి సోమవారం పుట్టిన రోజు కావడంతో మహా నగరం యావత్తు సంబురాలలో మునిగి తేలింది. గల్లీ నేత నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల దాకా అంతా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పుట్టిన రోజు వేడుకలను విభిన్నంగా జరిపారు. ప్రతి నేత, నాయకుడు తనకు తోచిన విధంగా కేటీఆర్పై అభిమానాన్ని చాటుకున్నారు. ఒక్కొక్క నాయకుడు వాళ్ల ఆర్థిక స్థోమత, స్థాయిని బట్టి నగరం అంతటా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, సంచులు, పేదలకు రెయిన్ కోట్లు, దివ్యాంగులకు టూ వీలర్స్, గొడుగులు, యువతకు ల్యాప్టాప్లు, ఇంకా ఎన్నెన్నో లక్షలాది విలువైన, అవసరమైన వస్తువులను అందించి కేటీఆర్పై గల అపార ప్రేమాభిమానాల్ని చాటుకున్నారు. కేటీఆర్ అభిమానులు, యువత, బీఆర్ఎస్ పార్టీ నేతలు వీధులలో ‘జై కేటీఆర్.. హ్యాపీ బర్త్ డే కేటీఆర్’ అంటూ నినదిస్తూ భారీ కేకులను కట్ చేసి బర్త్ డే వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
ఓయూలో గొడుగుల పంపిణీ
బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా నాగయ్య ఆధ్వర్యంలో ఓయూ ల్యాండ్ స్కేప్ గార్డెన్లో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై నాయకులు, విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. అంతే కాకుండా ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా విద్యార్థులకు గొడుగులను పంపిణీ చేశారు.
నాంపల్లిలో పండ్ల పంపిణీ
ఆసిఫ్నగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సీహెచ్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సరోజినీదేవి కంటి దవాఖానలో పండ్ల పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు, నాంపల్లి బీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కూకట్పల్లిలో చీరల పంపిణీ
ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ మల్లికార్జుననగర్లో మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ నర్సింహ యాదవ్
మల్లాపూర్లో రక్తదానం..
మల్లాపూర్లో రక్తదానం చేసిన దాతలకు పండ్ల రసం తాగిస్తున్న ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, పాల్గొన్న కార్పొరేటర్ దేవేందర్రెడ్డి