నాంపల్లి కోర్టులు, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనానికి భారీ సంఖ్యలో హాజరయ్యేందుకు నాంపల్లి కోర్టు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్డులోని జల విహార్లో ఏర్పాటు చేసిన సభకు మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారని, బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ‘చలో జల విహార్’ పేరిట సభను ఏర్పాటుచేసిన సందర్భంగా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు నాంపల్లి కోర్టులో న్యాయవాదులను కలిసి మద్దతు కూడగట్టారు. ఈ సభా సమావేశానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, అంబర్పేట ఎమ్మేల్యే కాలేరు వెంకటేశ్లు సైతం హాజరు కానున్నారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా విజయం సాధించేందుకు కలిసికట్టుగా ముందుగుసాగాలని కోరారు. కార్య్రకమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, బీఆర్ఎస్ సభ్యులు తిరుపతి వర్మ, డి.అనంత రఘు, సురేఖ సింగ్, శ్రీనాథ్, రాకేష్, విజయీభవ పాట రచయిత లక్ష్మణ్ గంగా తదితరులు పాల్గొన్నారు.