Childrens Day | చిల్డ్రన్స్ డే రోజున ఓ చిన్నారి చేసిన ట్వీట్పై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్లోని గోల్డెన్ సిటీ కాలనీ(పిల్లర్ నంబర్ 248) లో గత ఐదేండ్ల నుంచి తాగునీటి సమస్య ఉందని చిన్నారి ఉమర్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. డ్రింకింగ్ వాటర్ పైపులైన్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపాడు. అన్ని ట్యాక్సులు చెల్లిస్తున్నామని చెప్పాడు. ఈ ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. గోల్డెన్ సిటీ కాలనీకి వెళ్లి సమస్య పరిష్కరించాలని జల మండలి ఎండీ దాన కిశోర్కు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జల మండలి ఎండీ దాన కిశోర్ గోడ్డెన్ సిటీ కాలనీకి వెళ్లారు. చిన్నారి ఉమర్ను దాన కిశోర్ కలిశారు. అనంతరం కేటీఆర్కు ట్వీట్ చేశారు జలమండలి ఎండీ. గోల్డెన్ సిటీ కాలనీకి వెళ్లి చిన్నారి ఉమర్ను కలిశాం. ఈ ఏరియాకు వాటర్ పైపులైన్ కోసం రూ. 2.85 కోట్లు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వర్షాకాలం కారణంగా మొన్నటి వరకు పనులు చేపట్టలేదు. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. వాటర్లైన్కు ఉమర్ నివాసం 3.94 కిలోమీర్ల దూరంలో ఉందని, అందుకు గానూ రూ. 94 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. రెండు వారాల్లో ఆ ఏరియాకు తాగునీటి సరఫరా చేస్తామని జలమండలి ఎండీ దాన కిశోర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎండీ దాన కిశోర్కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
Well done MD Garu 👍 https://t.co/ukjs32Tzuo
— KTR (@KTRTRS) November 14, 2022