హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ సైలెంట్ వ్యాలీ వద్ద నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. రూ. 30.30 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి షేక్పేట్ మధ్య 5 కిలోమీటర్ల నుంచి 3.5 కి.మీ. దూరం తగ్గింది.
ఇక ఓల్డ్ బాంబే హైవే రోడ్డు నుంచి ఖాజాగూడ వెళ్లే లింక్ రోడ్డును కేటీఆర్ ప్రారంభించారు. ఈ రోడ్డు మల్కం చెరువు, చిత్రపురి కాలనీ మీదుగా వెళ్లనుంది. ఖాజాగూడ లేక్ నుంచి ఓఆర్ఆర్ వెళ్లే లింక్ రోడ్డును కూడా కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం రాయదుర్గం వద్ద పునరుద్ధరించి, సుందరీకరించిన మల్కం చెరువును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
To improve the road connectivity between Jubilee Hills and Shaikpet Road, the Govt of Telangana constructed a steel bridge at Silent Valley in Jubilee Hills. Ministers @KTRTRS, @YadavTalasani, @mahmoodalitrs & @SabithaindraTRS inaugurated the Steel Bridge today. pic.twitter.com/VeeJllsah0
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 4, 2022