హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ (KTR )జన్మదిన వేడుకలు సోమవారం పీవీ మార్గ్ లోని థ్రిల్ సిటీ థీమ్ పార్క్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ప్రపంచ రికార్డ్ సాధించిన రూబిక్స్ క్యూబ్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్ కుట్టి కండ్లకు గంతలు కట్టుకొని రూబిక్ క్యూబ్స్ తో రూపొందించిన KTR చిత్రం, HAPPY BIRTH DAY KTR ANNA విషెస్ ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఇర్ఫాన్ కుట్టి ని సత్కరించి అభినందించారు. అదేవిధంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా ఒకొక్కరికి 10 లక్షల రూపాయల రిక్స్ కవరేజ్ తో వివిధ ఛానళ్లకు చెందిన వెయ్యి మంది వీడియో జర్నలిస్ట్ లకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ లను మంత్రుల చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా థ్రిల్ సిటీ థీమ్ పార్క్లో గల వరల్డ్ బిగ్గెస్ట్ త్రీడీ స్క్రీన్ లో మంత్రి KTR కు విషెస్ తెలియజేస్తూ రూపొందించిన వీడియో ను వీక్షించారు. అదేవిధంగా KTR పనితీరు, వ్యక్తిత్వం, సాధించిన విజయాలను వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక సాంగ్ ను ప్రదర్శించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ కేక్ ను కట్ చేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్ లు గజ్జెల నగేష్, కోలేటి దామోదర్ గుప్తా, అనిల్ కుమార్ కూర్మాచలం, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, నగర గ్రంథాయల సంస్థ చైర్మన్ ప్రసన్న, కార్పొరేటర్లు హేమలత, టి.మహేశ్వరి, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, తరుణి, సేనియర్ నాయకులు క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.