అంబర్పేట, నవంబర్ 1 : అంబర్పేట నియోజకవర్గం నుంచి మరోసారి కాలేరు వెంకటేశ్కు సీఎం కేసీఆర్ పార్టీ టికెట్టు ఇచ్చారని, అందరూ కలిసికట్టుగా పనిచేసి రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ నియోజకవర్గం అసంతృప్త నేతలకు సూచించారు. గత కొంత కాలంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్కు దూరంగా ఉంటున్న కొందరు పార్టీ నేతలను ఇటీవల పార్టీ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జిగా నియమితులైన గండ్ర మోహన్రావు కలిసి బుజ్జగించారు. బుధవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఇన్చార్జి గండ్ర మోహన్రావు పార్టీ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్రెడ్డి, బాగ్అంబర్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ కె.పద్మావతిడీపీరెడ్డి, విజితారెడ్డి, జేడీ రాహుల్, పి.గిరిధర్గౌడ్, శ్రీనివాస్యాదవ్, జమీల్, మెట్టు ధన్రాజ్ను మంత్రి కేటీఆర్తో కలిపించారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంబర్పేటలో కాలేరు వెంకటేశ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారికి సూచించారు. ఇదిలా ఉండగా మూడు, నాలుగు రోజుల కిందట నల్లకుంట మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవిరమేశ్ కూడా మంత్రి కేటీఆర్ను కలిశారు.