సిటీబ్యూరో/మాదాపూర్, నవంబర్ 8 : కొవిడ్ సమయంలో ఉత్తమ సేవలు అందించిన ఐటీ, స్వచ్ఛంద సంస్థలు, నిర్మాణ సంస్థలతో పాటు ఇతర కంపెనీలకు, ప్రతినిధులకు ప్రత్యేక గుర్తింపు లభించింది. టీఎస్ఐజీ (తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్) ఆధ్వర్యంలో సోమవారం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, నటుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త సోనూసూద్ హాజరై అవార్డులను అందజేశారు. కొవిడ్ సమయంలో సమాజ సేవ చేసిన వారంతా ప్రజల మనసులో రియల్ హీరోలుగా గుర్తింపు పొందారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన 12 కార్పొరేట్ సంస్థలు, 26 ఎన్జీఓలు, 6 సమన్వయ సంస్థలు, 29 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం చేసిన వ్యక్తులతో పాటు 850కి పైగా సంస్థలు, వ్యక్తులను గుర్తించి ఈ- సర్టిఫికెట్ (ఎలక్ట్రానిక్) ద్వారా వారిని సత్కరించారు.
వివిధ రంగాల్లో కొవిడ్ వారియర్స్కు అవార్డులు.. ఎన్జీవో కేటగిరీ..