పాతబస్తీలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం పాతబస్తీలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వివిధ నియోజకవర్గాల్లో ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్లు, రహదారులు, నాలాల వెడల్పు, డబుల్ బెడ్ రూం గృహాలు, తాగునీటి రిజర్వాయర్ పైప్లైన్లు, ఇతర మౌలిక వసతుల కల్పనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో అవాంతరాలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తేవాలని అధికారులకు సూచించారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా ఉన్నతాధికారులు శ్రద్ధ వహించాలన్నారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.