నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాలలో రూ.48కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన రోబోటిక్ యంత్రాలతో పాటు సర్జికల్ యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో విభాగాలకు సంబంధించిన యంత్రాలను సోమవారం ఎమ్మెల్యే క్రాంతి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్పతో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. సర్జరీ గౌన్ ధరించిన మంత్రి కొంత సేపు రోబో యంత్రంపై కూర్చుని అధికారులను యంత్రాల పనితీరు అడిగి తెలుసుకున్నారు.
సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ) : నిమ్స్లో కొత్తగా ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్చార్జిగా యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ను నియమిస్తూ నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ను ఆపరేట్ చేయడంలో ఇప్పటికే శిక్షణ పొందిన రాహుల్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు.