శంషాబాద్ రూరల్, మే 30 : దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. మంత్రి నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్లో శంషాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, ఎంపీడీవో వసంతలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డిలతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు. జూన్ 2 వ తేదీ నుంచి 22 వరకు రోజు వారీగా ఉత్సవాలను నిర్వహించి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి తెలిసే విధంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో ఎంపీవో ఉషాకిరణ్, పంచాయతీ కార్యదర్శులు శ్రీకాంత్గౌడ్, సుజాత,లక్ష్మీనారాయణ, ప్రదీప్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో..
బండ్లగూడ, మే 30 : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మేయ ర్ మహేందర్గౌడ్ అన్నారు. బం డ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మహేందర్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మహేందర్గౌడ్ మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నుంచి 20 వరకు దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ముందస్తుగా నిర్ణయించుకున్న ప్రణాళిక బద్ధంగా ప్రతిరోజు వేడుకలను వైభవంగా జరుపాలని సూచించారు. దీని కోసం ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కలిసికట్టుగా పనిచేసేందుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి, కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, కార్పొరేటర్లు పద్మావతి పాపయ్యయాదవ్, చంద్రశేఖర్, రవీందర్రెడ్డి, భూపాల్గౌడ్, ప్రశాంత్ నాయక్, అస్లాంబిన్ అబ్దుల్లా, ముద్దం రాము, సాగర్గౌడ్, కోఆప్షన్ సభ్యులు మాలాకీరత్నం, జగదీశ్ పాల్గొన్నారు.